
రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం
తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన రాపాక సహ దేవుడు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె రాపాక భావన. నిడదవోలు ప్రభుత్వ మహిళా కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు రాసి, 974 మార్కులతో సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది.
నిరుపేద కుటుంబమైనా..
పిఠాపురానికి చెందిన కాపుగంటి సత్య రాజ్యలక్ష్మి సుధశ్రీ ఓకేషనల్ కోర్సులు సెరికల్చర్ విభాగంలో 977 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రధమస్థానం సాధించింది. తల్లిదండ్రులు సర్వారాయుడు, సునీత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా ఆమె పట్టుదలతో చదవి అత్యుత్తమ ఫలితం సాధించింది. ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత లేని తన లాంటి వారికి గతంలో ఎన్నడు లేని విధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ కళాశాలల రూపు రేఖలు మారి అన్ని వసతులు రావడంతో చదువులో రాణించగలిగాలని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం