ఆత్రేయపురం : ఎట్టకేలకు ప్రభుత్వం బొబ్బర్లంక రోడ్డుకు మరమ్మతులు మొదలు పెట్టింది. సుమారు రూ.76 లక్షలతో బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారి నుంచి వెలిచేరు వరకు, లొల్ల వంతెన సమీపంలో 300 మీటర్లు మేర మరమ్మతులు ప్రారంభించారు. ఈ రహదారి దుస్థితిపై సాక్షి పత్రికలో గత నెల 13వ తేదీన ‘తారుక్కుపోయేలా..’ శీర్షికన వార్త ప్రచురించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించారు. మంగళవారం బొబ్బర్లంక నుంచి అమ్మవారి గుడి వరకు రోడ్డు వేశారు.


