తలుపులమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

తలుపులమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

తుని రూరల్‌: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,02,680, పూజా టికెట్లకు రూ.2,65,540, కేశఖండన శాలకు రూ.15,520, వాహన పూజలకు రూ.7,890, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.71,730, విరాళాలు రూ.43,929 కలిపి మొత్తం రూ.6,07,289 ఆదాయం సమకూరిందని వివరించారు.

ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు

ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రతతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో, ఆయకట్టుకు నీటి సరఫరాను తగ్గించారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 77.07 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 10.27 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 150, విశాఖపట్నానికి 225, పంపా జలాశయానికి 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి సరఫరా నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement