తాళ్లపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ వసతిగృహన్ని మంగళవారం కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించిన ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు కనీసం రాష్ట్రపతి, ప్రధాని, ఆర్డీఓ, తహసీల్దార్ పేర్లు తెలియని పరిస్థితి నెలకొంది. హాస్టల్లో 23 మంది విద్యార్థులకు సగం మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ కొంతకాలంగా వార్డెన్తో పాటు పలువురు సిబ్బంది లేకుండానే హాస్టల్ నడుస్తోంది. నాలుగు నెలల క్రితం వచ్చిన కుక్ (వంటమనిషి) శివాజీ అన్ని తానై హాస్టల్ను నడుపుతున్నారు. వార్డెన్గా, వాచ్మెన్గా, కుక్గా శివాజీ పని చేయటంపై అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీలావణ్య, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వోలు ప్రకాష్, నాగేశ్వరరావు, సంజీవరావు, లీలావతి తనిఖీలో పాల్గొన్నారు.


