
దశల వారీ పోరాటానికి సిద్ధం
ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటానికి సిద్ధమవుతున్నాం. దానిలో భాగంగా ఆగస్టు 2న డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నాం. వేల మంది ఉపాధ్యాయులు తరలి వచ్చేలా కార్యాచరణ చేపడుతున్నాం.
– ఎంటీవీ సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు, ఫ్యాఫ్టో
ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి
కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాల నుంచి తీసుకున్న ఏ ఒక్క వినతిపైనా సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన సమస్యలపై కనీస స్పందన లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపై మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు విచారకరం.
– పోతంశెట్టి దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాఫ్టో

దశల వారీ పోరాటానికి సిద్ధం