
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చాగల్లు: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు – పంగిడి రహదారిలోని ఎస్.ముప్పవరం శివారులో ఇసుక ట్రాక్టర్ ఆగి ఉంది. దాన్ని పోలవరం నుంచి నిడదవోలు వెళుతున్న నిడదవోలు డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అలాగే బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆన్ అయ్యి సమీపంలో ఇంటి గేటును ఢీకొని ట్రక్కు బొల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న కొవ్వూరుకు చెందిన జి.వీర వెంకట సత్యనారాయణతో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో వారిని మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు చేరవేశారు.