కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
బుకారెస్ట్ : కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన ఘటన రొమేనియా దేశంలో చోటు చేసుకుంది. పియాట్రా నీమ్ట్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ వార్డ్లో షార్ట్సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులలందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన వారంతా ఆస్పత్రి రోగులేనని అధికారులు స్పష్టం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి