కర్కశం: తాగుబోతు తల్లి.. చదువు మాన్పించి బిచ్చమెత్తలేదని కూతురిపై.. 

Mother Pours Hot Oil On Her Daughter East Godavari District - Sakshi

కాకినాడ(తూర్పుగోదావరి): అడుక్కోవడానికి వెళ్లమంటే వెళ్లనందని 11 ఏళ్ల కుమార్తెపై ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. కాకినాడ దుమ్ములపేటకు చెందిన కారే థెరెస్సాకు సుగుణ అనే 11 ఏళ్ల కుమార్తె ఉంది. బంధువుల సహకారంతో బాలిక వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. కొన్నాళ్ల క్రితం తల్లి థెరెస్సా కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. మద్యానికి బానిసై కుమార్తెను నిత్యం వేధించేది. బిచ్చమెత్తి డబ్బులు తెచ్చివ్వాలని కొడుతూండేది. సుగుణ వెళ్లనని చెప్పింది. ఆదివారం మరోమారు వెళ్లి తీరాలని థెరెస్సా చెప్పింది.

కుమార్తె వెళ్లననీ, తాను చదువుకుంటానని హాస్టల్‌కు పంపేయమంటూ ప్రాధేయపడింది. కనికరించని తల్లి బాలికను కొట్టింది. స్టౌపై నూనె మరిగించి బాలిక ఒంటిపై పోసింది. బాలిక చేతులు కాలి గాయాలపాలై బిగ్గరగా ఏడవడంతో బాలికను స్థానికులు తల్లి చెర నుంచి తప్పించి సమీపంలో నివాసం ఉంటున్న మేనమామ కుటుంబానికి అప్పగించారు. వారు బాలికను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top