
ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు మంజూరు చేయాలి.
– మన్సూర్, పుంగనూరు
ఇస్తారో.. ఇవ్వరో
కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ట్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇప్పుడు ఆ నిధుల గురించి ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. ఇలా చేస్తే ఎలా..?
– రుషి, పలమనేరు

ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు