కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు శనివారం హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ 2,300 డాలర్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఈవో పెంచలకిషోర్కు ఆ నగదును అందజేయగా.. ఆయన దాత కుంటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు.
గుర్తుతెలియని వాహనం ఢీ : ఒకరికి తీవ్ర గాయాలు
రొంపిచర్ల: గుర్తుతెలియ వివాహం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారి, రొంపిచర్ల మండలం, పెట్రోల్ బంక్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. తూర్పు దళిత వాడకు చెందిన వెంకటరమణ 42 బండికింద పల్లె పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొంది. వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రొంపిచర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వెంకటరమణను చికిత్స నిమిత్తం అన్నమయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్యూటీలో గుండెపోటుతో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్
చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉంటూ గుండెపోటుతో మురళీకృష్ణ (61) అనే హెడ్ కానిస్టేబుల్ శనివారం మృతి చెందారు. చిత్తూరులోని గంగనపల్లికు చెందిన మురళీకృష్ణ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రికి 8.30 గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో అక్కడే డ్యూటీలోనే ఇబ్బంది పడ్డారు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. హెడ్కానిస్టేబుల్ మృతిపై ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం