
భృతి ఎగ్గొట్టారు
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులందరికీ మాయమాటలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగభృతి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచేసింది. మోసం చేయడం సబబుకాదు. – మున్నా, చిత్తూరు
మోసం చేశారు
2014–2019 సంవత్సరాల్లో రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని హామీనిచ్చారు. తూతూమంత్రంగా ఆ భృతిని కొందరికే ఇచ్చి మోసం చేశారు. ఈ సారి కూడా అలాగే మోసం చేస్తున్నారు. నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం ఉచ్చులో పడి అల్లాడుతున్నారు. ఉద్యోగాలు ఏమైన ఇస్తార అంటే అది కూడ లేదు. – సంజయ్, చిత్తూరు

భృతి ఎగ్గొట్టారు