సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Published Mon, Jan 15 2024 3:44 PM

Stock Market Closing Today - Sakshi

ఈ రోజు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 801.16 పాయింట్ల భారీ లాభంతో 73369.62 వద్ద, నిఫ్టీ 202.90 పాయింట్ల లాభంతో 22097.45 వద్ద నిలిచింది. ఈ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా మంచి లాభాల్లో దూసుకెళ్లాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్‌టెల్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. HDFC లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, సన్ టీవీ నెట్‌వర్క్, టీవీఎస్ మోటార్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) 

Advertisement

తప్పక చదవండి

Advertisement