ఆధార్‌ డేటాపై హాట్‌మెయిల్‌ కోఫౌండర్‌ సంచలన ఆరోపణలు | Data of 815M people reportedly on sale Sabeer Bhatia alleges Aadhaar breach | Sakshi
Sakshi News home page

ఆధార్‌ డేటాపై హాట్‌మెయిల్‌ కోఫౌండర్‌ సంచలన ఆరోపణలు

Nov 21 2025 11:53 AM | Updated on Nov 21 2025 12:52 PM

Data of 815M people reportedly on sale Sabeer Bhatia alleges Aadhaar breach

భారత పౌరుల ఆధార్‌ డేటా భద్రతపై హాట్‌ మెయిల్‌ కోఫౌండర్‌ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియాఎక్స్‌’ (ట్విటర్‌)లో చేసిన పోస్ట్సోషల్మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

మొత్తం ఆధార్ డేటాబేస్ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించిందిభాటియా తన పోస్ట్లో పేర్కొన్నారు.

భారత ఆధార్డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తంచేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.

సబీర్ భాటియా ఆధార్వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్డిజైన్‌, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్నిర్మాణానికి 1.3 బిలియన్డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్ఆథెంటికేషన్వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement