సైయంట్‌ లాభం రూ.173 కోట్లు | Sakshi
Sakshi News home page

సైయంట్‌ లాభం రూ.173 కోట్లు

Published Fri, Jan 26 2024 4:58 AM

Cyient profit is Rs.173 crores - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో సైయంట్‌ లాభం 11.5 శాతం పెరిగి రూ.173 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.239 కోట్లు, ఎబిటా మార్జిన్‌ 16 శాతం నమోదైంది. ఆర్డర్ల రాక 21.9 శాతం పెరిగింది.

టర్నోవర్‌ 8 శాతం ఎగసి రూ.1,491 కోట్లకు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే సైయంట్‌ షేరు ధర బీఎస్‌ఈలో గురువారం 1.39 శాతం క్షీణించి రూ.2,018.95 వద్ద స్థిరపడింది.

Advertisement
Advertisement