రోశిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు
బూర్గంపాడు: పీసీసీ మాజీ సభ్యుడు యడమకంటి రోశిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అన్నారు. నాగినేనిప్రోలులోని రోశిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం జరిగిన దశదిన కర్మలకు వారు హాజరై నివాళులర్పించాక మాట్లాడారు. దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుచరుడిగా భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాలలో పార్టీ అభివృద్ధికి ఆయన కృషిచేశారని, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలు పాయం, తెల్లం


