నాణ్యమైన విద్యనందించాలి
కొత్తగూడెంఅర్బన్: దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నాణ్యమైన విద్యనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే వంటి మహోన్నత వ్యక్తుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని బాగు చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నా రు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ బోధన వృత్తి మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత పేర్కొన్నారు. 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న 44 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకుడు కొదుమూరు సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.


