
‘ఖాకీ’లుగా పేద రైతు బిడ్డలు
గుండాల : మండల కేంద్రానికి చెందిన గడ్డం మోహన్ ఓ సన్నకారు రైతు. కొద్దిపాటి వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివించాడు. కొడుకులు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసి, వారి కలలను సాకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు సాగర్ ఖమ్మలో ఏఆర్ ఎస్సైగా, చిన్న కుమారుడు సంపత్ కొత్తగూడెంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా సాగర్, సంపత్ మాట్లాడుతూ తమ విజయం నాన్న మోహన్కే అంకితమని చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నామని, సమాజ సేవలోనూ ముందుంటూ యువతకు ఆరద్శంగా నిలుస్తామని చెప్పారు.