
మెడికోలుగా ఆటో డ్రైవర్ కుమార్తెలు
ఇల్లెందు: ఇల్లెందు మండలం మసివాగు గ్రామానికి చెందిన కిన్నెర రమేష్ – రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆటో నడుపుతూ జీవనం సాగించే రమేష్.. కుమార్తెలు అంజలి, భవానీలను ఉన్నత విద్య చదివిస్తున్నాడు. ఇద్దరూ ఐదో తరగతి వరకు ముత్తారపు కట్ట ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత కిన్నెరసాని, సుదిమళ్ల గురుకులాల్లో చదవగా.. ఇంటర్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఉచిత సీటు సాధించారు. ప్రస్తుతం అంజలిని హైదరాబాద్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదివిస్తుండగా, భవాని ఫిజియోథెరపీ కోర్సులో ప్రథమ సంవత్సరంలో ఉంది. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కలలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఈ భావి డాక్టర్లు చెబుతున్నారు.