తండ్రి కల సాకారం.. | - | Sakshi
Sakshi News home page

తండ్రి కల సాకారం..

Jun 15 2025 8:23 AM | Updated on Jun 15 2025 8:23 AM

తండ్రి కల సాకారం..

తండ్రి కల సాకారం..

ఇల్లెందురూరల్‌ : పంచాయతీ వర్కర్‌గా, వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు మండలంలోని నిజాంపేటకు చెందిన రావెళ్ల మోహన్‌రావు, జ్ఞాన దంపతులు. ఇద్దరూ నిరంతరం శ్రమిస్తూ కుమారుడు దయాకర్‌, కూతురు కరుణకుమారిని ఇంటర్‌ వరకు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివించారు. ఆ తర్వాత ఇద్దరూ బీటెక్‌లో ఉచిత సీట్లు సాధించి ఉన్నత విద్యావంతులయ్యారు. ప్రస్తుతం దయాకర్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా, కరుణకుమారి ఎంటెక్‌ పూర్తి చేసి ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ.. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా కష్టపడి చదివించానని, ఇప్పుడు ఇద్దరూ ప్రయోజకులు కావడం ఆనందంగా ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement