
తండ్రి కల సాకారం..
ఇల్లెందురూరల్ : పంచాయతీ వర్కర్గా, వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు మండలంలోని నిజాంపేటకు చెందిన రావెళ్ల మోహన్రావు, జ్ఞాన దంపతులు. ఇద్దరూ నిరంతరం శ్రమిస్తూ కుమారుడు దయాకర్, కూతురు కరుణకుమారిని ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించారు. ఆ తర్వాత ఇద్దరూ బీటెక్లో ఉచిత సీట్లు సాధించి ఉన్నత విద్యావంతులయ్యారు. ప్రస్తుతం దయాకర్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, కరుణకుమారి ఎంటెక్ పూర్తి చేసి ఐసీఐసీఐ బ్యాంక్లో మేనేజర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడుతూ.. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా కష్టపడి చదివించానని, ఇప్పుడు ఇద్దరూ ప్రయోజకులు కావడం ఆనందంగా ఉందని అన్నారు.