లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం

Jun 15 2025 8:03 AM | Updated on Jun 15 2025 8:23 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌లు ఉపకరిస్తాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పాటిల్‌ వసంత్‌ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కక్షిదారుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే లోక్‌ అదాలత్‌ ధ్యేయమని అన్నారు. కలహాలు విడనాడి కేసులను సామరస్యంగా, రాజీమార్గంలో పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతాయని సూచించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా 6,494 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇందులో కొత్తగూడెం కోర్టు పరిధిలో 3,934, ఇల్లెందు కోర్టు పరిధిలో 551, భద్రాచలంలో 1, 246, మణుగూరు కోర్టు పరిధిలో 763 ఉన్నాయని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్‌ మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌ మంచి వేదిక అని అన్నారు. సదస్సుకు హాజరైన కక్షిదారులకు మధ్యాహ్నం పులిహోర, తాగునీటి సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.కిరణ్‌కుమార్‌, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.సాయిశ్రీ, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి రవికుమార్‌, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వి. పురుషోత్తంరావు, డిప్యూటీ కౌన్సిల్‌ పి. నిరంజన్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. మెంబర్లుగా ఎ.పార్వతి, పి. విఠల్‌, జి. రామచంద్రారెడ్డి, ఎన్‌. ప్రతిభ, వై. యుగంధర్‌నాయుడు వ్యవహరించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పాటిల్‌ వసంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement