
మెనూ పక్కాగా అమలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. విద్యాశాఖ కోఆర్డినేటర్లు నాగరాజశేఖర్, ఓ.సైదులు, సతీష్కుమార్, శ్రీనివాసరావు, బాబూలాల్, రవి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ వెంకటేశ్వరాచారి