
మక్కా పాదయాత్రికుడికి సత్కారం
ఇల్లెందు: పట్టణంలోని నంబర్–2 బస్తీకి చెందిన అబీద్ మూడు దేశాలను చుట్టి 7,500 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా నడిచి వెళ్లి మక్కా యాత్రను విజయవంతం చేసుకుని ఇల్లెందుకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం సత్కరించారు. బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ, జేకే శ్రీనివాస్, శీలం రమేశ్, చోటిమియా, అబ్దుల్ నబీ, అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేశ్, చాంద్పాషా, భుక్యా సురేశ్, నీలం రాజశేఖర్, సన రాజేశ్, సాతల్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గిరిప్రదక్షిణకు
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఖమ్మంమామిళ్లగూడెం: వచ్చే నెల 10న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం రీజియన్లోని మణుగూరు, సత్తుపల్లి, ఖమ్మం డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. జూలై 8న సాయంత్రం 7 గంటలకు ఖమ్మం నుంచి, మణుగూరు నుంచి 6 గంటలకు, సత్తుపల్లి నుంచి 7 గంటలకు బయలుదేరే బస్సులు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత 9వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. అలాగే, 10వ తేదీన గిరిప్రదక్షిణ, అరుణాచలేశ్వరుడి దర్శనం అనంతరం మధ్యాహ్నం బయలుదేరే బస్సులు 11వ తేదీన ఉదయం డిపోలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఖమ్మం, సత్తుపల్లి నుంచి పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.2,500, మణుగూరు నుంచి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.2,750 చార్జీగా నిర్ణయించినట్లు ఆర్ఎం తెలిపారు. ఇతర వివరాలు, రిజర్వేషన్ కోసం మణుగూరు డిపో మేనేజర్ (99592 25963), సత్తుపల్లి డీఎం 99592 25962, ఖమ్మం డీఎం 99592 25958 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ అధికారుల
ఫోన్ నంబర్ల మార్పు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు మారినట్లు ఎస్ఈ జి.మహేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఈ, డీఈల ఫోన్ నంబర్ల వివరాలిలా ఉన్నాయి.
ఎస్ఈ – 87124 85815
డీఈ(టెక్నికల్) – 87124 85816
కొత్తగూడెం డీఈ – 87124 85849
పాల్వంచ డీఈ – 87124 85949
భద్రాచలం డీఈ – 87124 86022
నాణ్యతతో చెక్డ్యాం నిర్మాణం చేపట్టాలి
దుమ్ముగూడెం : మండలంలోని బొజ్జిగుప్ప గ్రామంలో చేపట్టిన చెక్డ్యామ్ పనులు నాణ్యంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రవికుమార్ సూచించారు. శుక్రవారం ఆయన చెక్డ్యాంను క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సయ్యద్ అహ్మద్ జానీ, వెంకటరమణ, మధుసూదన్రావు, రవీందర్, రాజ్సుహాస్, శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదుపుతప్పి
పల్టీ కొట్టిన కారు
జూలూరుపాడు: స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు జూలూరుపాడు పోలీస్స్టేషన్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ సమయంలో కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో పాల్వంచకు చెందిన డ్రైవర్ శివప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.
ముగ్గురు పిల్లలతో
వివాహిత అదృశ్యం
ములకలపల్లి: ముగ్గురు పిల్లలతో వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. అన్నపురెడ్డిపల్లి మండలానికిి చెందిన సునీతకు ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కుక్కముడి నవీన్తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు కుమార్తెలున్నారు. గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులను వెళ్లగా, సునీత పిల్లలతో కలిసి బయటికి వెళ్లింది. ఇంటికొచ్చిన కుటుంబీలకు ఎవరూ కనిపించకపోవడంతో సునీత తల్లిదండ్రులను ఆరాతీయగా అక్కడికీ రాలేదని తెలిసింది. సునీత తండ్రి మహంకాళి శ్రీను శుక్రవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.