
హత్య కేసులో 12 మంది అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఏఎస్ఆర్ కాలనీలో ఈ నెల 7న జరిగిన కణితి సతీశ్ హత్య కేసులో పరారీలో ఉన్న 12 మంది నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు గుంజ సాయిని ఈ నెల 10న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో బూర్గంపాడు మండలం లక్ష్మీపురం వాసి మాగ్దం మొహినుద్దీన్నజీర్, భద్రాచలానికి చెందిన మోటుపలి కామేశ్, వల్లెపు సాంబ, వల్లెపు దుర్గాప్రసాద్, గుంజా గోపిచంద్, గోళ్ల గణేశ్, చెంచాలపు రాహుల్తేజ, గుంజా వెంకటేశ్, ఎటపాక మండలం చేన్నాంపేట వాసి గుండి రాకేశ్, ఎటపాకకు చెందిన బానోత్ మధు, సారపాకకు చెందిన చల్లా అజయ్, మోతుకురి సాయి ఉన్నారని, ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని ఏఎస్పీ వివరించారు.