
గంజాయి సీజ్
భద్రాచలంఅర్బన్: అక్రమంగా తరలిస్తున్న 4.2 కేజీల గంజాయిని గురువారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మూడు బైక్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పాల్వంచకు చెందిన ముగ్గురు మైనర్లతోపాటు ఏపీలోని ఏలూరుకు చెందిన పసుపులేటి నాగకుమార్, వంజరపు శ్రీనివాస్, అభిషేక్ ఉన్నారు. వీరు ఒడిశాలోని మల్కన్గిరి నుంచి పాల్వంచకు, అక్కడి నుంచి ఏలూరుకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను, వాహనాలను స్థానిక ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ అప్పగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీ హరిరావు తెలిపారు.
పోక్సో కేసులో
నిందితుడి అరెస్ట్
అశ్వారావుపేటరూరల్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్సై యయాతిరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని వడ్డెర బజార్కు చెందిన యువకుడు మక్కెళ్ల మారేష్ మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై కొద్దిరోజులుగా ప్రేమపేరుతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలి తల్లి ఈ నెల 2న ఫిర్యాదు చేయగా, అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి దమ్మపేట కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని ఎస్సై తెలిపారు.
బెల్లం, పటిక స్వాధీనం
జూలూరుపాడు: మండలంలోని సాయిరాంతండాలో నాటు సారా తయారీకి ఉపయోగించే రెండు క్వింటాళ్ల నల్లబెల్లం, 40 కిలోల పటికను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హలావత్ శ్రీనుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నల్లబెల్లం విలువ రూ 23,400, పటిక విలువ రూ .1200 ఉంటుందని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.
కరకగూడెంలో...
కరకగూడెం: మండలంలోని కలవలనగారం గ్రామ అటవీ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాల బెల్లం, 10 కేజీల పటిక, 10 లీటర్ల గుడుంబాను బుధవారం రాత్రి ఎకై ్సజ్ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణుగూరులోని ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి, నిందితుడు కె.సాగర్పై కేసు నమోదు చేసినట్లు మణుగూరు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి తెలిపారు.

గంజాయి సీజ్