శిథిల భవనాలతో ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

శిథిల భవనాలతో ప్రమాదం!

Jun 12 2025 3:17 AM | Updated on Jun 12 2025 3:17 AM

శిథిల

శిథిల భవనాలతో ప్రమాదం!

● వర్షాకాలంలో కూలిపోయి నష్టం జరిగే అవకాశం ● కొత్తగూడెంలో 42 భవనాలకు నోటీసులు జారీ ● పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో ఇంకా గుర్తింపు దశలోనే..

కొత్తగూడెంఅర్బన్‌: వర్షాకాలం ప్రారంభంమవుతున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు ప్రమాదం పొంచి ఉంది. మున్సిపాలిటీ పరిధిల్లోనే ఇలాంటి భవనాలు ఎక్కువగా ఉన్నాయి. భారీవర్షాలు ఎడతెరపి లేకుండా కురిస్తే వర్షపు నీటికి నాటి కూలే పోయే అవకాశం ఉంది. ఎలాంటి నష్ట మూ జరగకుండా ఉండాలంటే మున్సిపల్‌ అధికారులు, భవనాల యజమానులు అప్రమత్తమై మరమ్మతులు చేయించుకోవడం, ప్రమాదకరంగా భవనాలను పూర్తిగా తొలగించడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌లో కొత్తగూడెం పట్టణంలో మాత్రమే శిథి లావస్థలోని భవనాల యజమానులకు టౌన్‌ ప్లానింగ్‌ అధి కారులు నోటీసులు జారీ చేశారు. కార్పొరేషన్‌లోని పాల్వంచతో పాటు ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సి పాలిటీల్లో సంబంధిత అధికారుల్లో ఇప్పటివరకు చలనంలేదు.

కొత్తగూడెంలో 42 భవనాలకు నోటీసులు..

జిల్లా కేంద్రంలో నేతాజీ మార్కెట్‌, సూపర్‌బజార్‌ ఏరియా, మేదరబస్తీ ఏరియా, పాత కొత్తగూడెంలోని ఎస్సీ కాలనీలలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కార్పొరేషన్‌ అధికారులు ఇటీవల 42 భవనాలను గుర్తించి, యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా భవనాలకు మరమ్మతులు చేయించుకోకపోయినా, కూల్చివేయకపోయినా మున్సిపల్‌ అధికారులు వాటిని తొలగించే అవకాశం ఉంది. పాతకొత్తగూడెంలోని ఎస్పీ కాలనీలో ఏటా వర్షాకాలంలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వానలు కురిసే సమయంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. కాగా ఇళ్ల యజమానులు వాటిని తొలగించకపోవడంతో ఎప్పుడో ఏం జరుగుతుందో తెలియన ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఈ ఏడాది వర్షాలకు పాతకొత్తగూడెం, నేతాజీ మార్కెట్‌లోని ఇళ్లు కూలే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కొత్తగూడెం పాత మున్సిపల్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరగా, ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. రైటర్‌బస్తీలోని ఎకై ్సజ్‌ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరింది. ఇల్లెందు మున్సిపాలిటీలో శిథిలావస్థలో ఉన్న భవనాలను, ఇళ్లను అధికారులు గుర్తిస్తున్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో పోలీసు క్వార్టర్స్‌లో కొన్ని శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించారు. ఆయా భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో కూడా నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

వర్షాకాలానికి ముందే గుర్తించాల్సి ఉన్నా..

అధికారులు శిథిల భవనాలను వర్షాకాలానికి ముందే గుర్తించి కూల్చివేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం నెల ముందుగానే నోటీసులు జారీ చేయసి, అప్పటికీ యజమానులు స్పందించకపోతే తొలగింపు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో కొత్తగూడెంలో తప్ప ఎక్కడ కూడా ఇప్పటివరకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయలేదు. క్రమంగా వర్షాలు పెరిగి ప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తినష్టం కూ డా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికై న మున్సిపల్‌ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరమ్మతు చేయించుకోవాలి

కొత్తగూడెం, పాల్వంచలో పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లకు మరమ్మతులు చేయించుకోవాలి. వర్షాలు మొదలయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యజమానులు పట్టించుకోకపోతే మున్సిపల్‌ నిబంధనల ప్రకారం సిబ్బంది భవనాలను తొలగిస్తారు.

–సుజాత, కొత్తగూడెం కార్పొరేషన్‌ కమిషనర్‌

శిథిల భవనాలతో ప్రమాదం!1
1/1

శిథిల భవనాలతో ప్రమాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement