
బంక్లోకి దూసుకెళ్లిన లారీ
అశ్వారావుపేటరూరల్: డ్రైవర్ నిర్లక్ష్యంతో బుధవారం ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికు ల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద గల భారత్ పెట్రోల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనదారుడిపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన ద్విచక్రవాహనదారుడు బత్తుల కృష్ణ బైక్ను అక్కడే వదిలేసి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కృష్ణది ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి కాగా, వినాయకపురంలో జేసీబీలను అద్దెకు తిప్పుతున్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు కాగా, బంక్ లోపలికి దూసుకెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇద్దరు గిరిజనుల అరెస్ట్
దుమ్ముగూడెం: మండలంలోని గడ్డోరగట్ట గ్రామ అటవీప్రాంతంలో ట్రంచ్ కొడుతుండగా అడ్డుకున్న ఇద్దరుగిరిజనులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టులో రిమాండ్ చేశారు. పోడుభూముల్లో అటవీశాఖ సిబ్బంది వేసిన ప్లాంటేషన్ను గడ్డోరగట్ట గ్రామానికి చెందిన గిరిజనులు నరికివేశారు. దీనిపై హైకోర్టులో కేసునడుస్తోంది. కాగా బుధవారం ఎఫ్డీఓ సుజాత ఆధ్వర్యంలో ట్రంచ్ కొట్టేందుకు వెళ్లిన సిబ్బందిని అడ్డగించి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్టు రేంజర్కమల తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో శోభన్, ఎఫ్ ఎస్ఓ నందా, బీట్ అధికారి వీరేందర్ పాల్గొన్నారు.
ఇద్దరికి పాము కాటు
గుండాల: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని పాముకాటు వేసిన సంఘటన ఆళ్లపల్లి మండలంలో బుధవారం జరిగింది. సింగారం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు చేను పనికి వెళ్లగా పాముకాటు వేసింది. అడవిరామారం గ్రామానికి చెందిన పాయం సువర్ణ కూడా చేను పనికి వెళ్లగా పాము కరిచింది. బాధితులను ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు.
వ్యక్తి ఆత్మహత్య
టేకులపల్లి: మండలంలోని చింతోనిచెలక తండాకు చెందిన బానోత్ హత్తీరాం (50) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఇరానీ పుట్టింటికి వెళ్లిది. మంగళవారం మధ్యాహ్నం హత్తీరాం కూడా వెళ్లి ఇంటికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమార్తె ఉష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బోడు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
టేకులపల్లి: చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిపై బుధవారం పోలీసులు కేసు నమో దుచేశారు. బోడు ఎస్ఐ పి. శ్రీకాంత్ కథనం ప్రకారం.. బర్లగూడెం గ్రామానికి చెం దిన పూనెం జోగయ్య(49) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య, కూతురు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. దీంతో మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 31న పురుగుల మందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.