
సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడి
కూసుమంచి: రైతులు వ్యవసాయంలో సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తే అధిక దిగుబడులు పొందొచ్చని భారతీయ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్.పద్మావతి తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంండలోని భగవత్వీడులో రైతులకు బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఖరీఫ్ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, వరి నూతన వంగడాలు, వాటితో ఉపయోగాలను వివరించడమే కాక కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్త అక్షిత్, ప్రోగ్రాం అసిస్టెంట్ నరేష్, ఏఓ వాణి పాల్గొన్నారు.