
రైల్వే ట్రాక్ పనులు అడ్డగింత
మణుగూరు టౌన్: ఒకవైపు సింగరేణి గుట్టలు, మరోవైపు బీటీపీఎస్ బొగ్గు తరలించేందుకు రైల్వే ట్రాక్ మధ్యలో తామెలా ఉండాలంటూ గాంధీనగర్ వాసులు మంగళవారం రైల్వే ట్రాక్ పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గతేడాది వచ్చిన వరదతో ఆర్థికంగా నష్టపోయామని, సింగరేణి నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు రైల్వే లైన్ కట్ట నిర్మిస్తే వర్షాలు కురియగానే ఊరు మునిగి పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. ప్రభుత్వం స్పందించి తమను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని కోరారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అద్దంకి నరేష్ అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి కలెక్టర్కు నివేదిస్తామని తెలి పారు. అనంతరం తహసీల్దార్కు గాంధీనగర్ వాసులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు నగేశ్, మల్లికాంబ, నక్కా వెంకటేశ్వర్లు, కుమారస్వామి, కారం వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.