యథేచ్ఛగా మట్టి తరలింపు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి తరలింపు

Jun 11 2025 8:48 AM | Updated on Jun 11 2025 8:48 AM

యథేచ్

యథేచ్ఛగా మట్టి తరలింపు

దమ్మపేట: ఎలాంటి అనుమతి లేకుండా జేసీబీతో అక్రమంగా మట్టి తవ్విన దళారులు యథేచ్ఛగా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మండలంలోని మల్లా రం గ్రామ శివారులో సోమవారం రాత్రి ఇలా తరలించిన దళారులు.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తామే చూసుకుంటామని హామీ ఇచ్చి, ఇటుకబట్టీలకు తరలించినట్లు సమాచారం. గత మూడు రోజులుగా ఇలా అడ్డూ అదుపు లేకుండా మట్టి తరలిస్తున్నారని, ట్రాక్టర్ల అతివేగంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ భగవాన్‌ రెడ్డిని వివరణ కోరగా.. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ప్రాంతానికి ఆర్‌ఐని పంపి విచారణ చేయిస్తామని చెప్పారు.

యథేచ్ఛగా మట్టి తరలింపు1
1/1

యథేచ్ఛగా మట్టి తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement