ముత్తంగి అలంకరణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

ముత్త

ముత్తంగి అలంకరణలో రామయ్య

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ప్రభుత్వాస్పత్రిలో

డీఎంహెచ్‌ఓ తనిఖీ

సుజాతనగర్‌: స్థానిక ప్రభుత్వాస్పత్రిని జిల్లా వైద్యాధికారి ఎల్‌.బాస్కర్‌ నాయక్‌ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయంటూ పేషెంట్లను ఆరా తీశారు. రికార్డులను పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, శిశు మరణాలు తగ్గించాలని ఆదేశించారు. గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య సూచనలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన ఐసెట్‌

సుజాతనగర్‌: స్థానిక అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఐసెట్‌ రెండో రోజైన సోమవారంతో ముగిసింది. మొత్తం 130 మందికి గాను 119 మంది విద్యార్థులు హాజరయ్యారని, 11 మంది గైర్హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.

ముత్తంగి అలంకరణలో రామయ్య1
1/2

ముత్తంగి అలంకరణలో రామయ్య

ముత్తంగి అలంకరణలో రామయ్య2
2/2

ముత్తంగి అలంకరణలో రామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement