పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి

Jun 10 2025 3:20 AM | Updated on Jun 10 2025 3:20 AM

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి

కొత్తగూడెంఅర్బన్‌: పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని, విరివిగా మొక్కలు నాటాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరా చారి సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో పని చేస్తున్న స్వచ్ఛ మిత్రలకు జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయని, మొక్కల పెంపకంతో స్వచ్ఛమైన గాలి అందుతుందని అన్నారు. అనంతరం వారికి యూనిఫామ్‌ అందజేశారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌, జిల్లా కో ఆర్డినేటర్లు నాగ రాజశేఖర్‌, సైదులు, శంకర్‌, డీఆర్పీ రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement