
నేడు డిఫ్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. 3గంటలకు ఖమ్మంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభ అనంతరం 6 గంటలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడెం వెళ్తారు.
పొంగులేటి పర్యటన..
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 6గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు కూసుమంచి మండలం పోచారం చేరుకుంటారు. 11.15 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.45 గంటలకు తెల్దారుపల్లిలో సీసీ రోడ్లకు, 12.15 గంటలకు కస్నాతండాలో సీసీ, బీటీ రోడ్లకు, 12.45 గంటలకు పోలేపల్లిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు.

నేడు డిఫ్యూటీ సీఎం, మంత్రుల పర్యటన