
రామయ్య సేవలో పాలకుర్తి ఎమ్మెల్యే
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని పాలకుర్తి ఎమ్మె ల్యే యశస్వినిరెడ్డి ఆదివారం సందర్శించారు. వేదపండితులు స్వాగతం పలకగా, ఆమె కు టుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ పీఆర్ఓ సాయిబాబ, వేదపండితు లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పెరిగిన భక్తుల సంఖ్య
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఈ ఏడాది మేలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గత ఏడాది 2,48,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది 2,88,103 మంది దర్శించుకున్నట్లు ఆయల ఈఓ ఎల్.రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఘర్షణ
ఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రిక్కాబజార్కు చెందిన ప్రేమజంట వివామం చేసుకొని రక్షణ కోసం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారు మేజర్లు కావడంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అయితే వెళ్లిపోయిన ప్రేమజంట పోలీస్ స్టేషన్కు వచ్చారని తెలుసుకొని ఇరువర్గాల వారు భారీగా పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఒకరినొకరు తిట్టుకుంటూ తోసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో సీఐ కరుణాకర్ అధ్వర్యంలో పోలీసులు వారిని చెదరగొట్టారు.
బోనమెత్తిన
గువ్వలగూడెం..
నేలకొండపల్లి: మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో గంగమ్మ దేవాలయం పునఃప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 8 వరకు జాతర నిర్వహించగా.. ఆదివారం ముగింపు రోజు కావడంతో మహిళలు బోనమెత్తి గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోరట్లగూడెం, పైనంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు రమేష్, భద్రయ్య, జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, వెంకన్న, కడియాల నరేష్, చెరువు స్వర్ణ, కొమ్మినేని విజయ్బాబు, అడపాల రామారావు, మార్తి కోటి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
ముదిగొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ముదిగొండ మండలం బాణాపురం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమండవకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనుముల అనిల్రెడ్డి స్కూటీపై బాణాపురం వస్తుండగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సర్గం శరత్కుమార్(35) బుల్లెట్పై వస్తూ ఢీకొట్టాడు. దీంతో బుల్లెట్ పైనుంచి కిందపడిన శరత్కుమార్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్రెడ్డి తలకు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.
కారుడ్రైవర్పై కేసు
పాల్వంచరూరల్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని కారు ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఖమ్మం చర్చికాంపౌండ్కు చెందిన ఇమ్మడి లలిత ఈ నెల 5వ తేదీన మండలంలోని బస్వతారకకాలనీలోని వాసుమల్ల మోసు ఇంటికి వచ్చింది. రోడ్డు దాటుతుండగా పాల్వంచ వైపు వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. మోసు ఫిర్యాదు మేరకు కారుడ్రైవర్ అశోక్పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.

రామయ్య సేవలో పాలకుర్తి ఎమ్మెల్యే

రామయ్య సేవలో పాలకుర్తి ఎమ్మెల్యే