
మానసిక స్థైర్యం కల్పించాలి
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధితో చిన్నారులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, వారితో పాటు తల్లిదండ్రుల్లోనూ మానసిక స్థైర్యం కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోనల్ వైద్యాధికారి గిరిసింహారావు అన్నారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియాతో ప్రమాదం లేకున్నా ఆ వ్యాధిని తలుచుకుని బాధ పడడం వల్లనే మరింత అనారోగ్యాలకు గురవుతారని చెప్పారు. చిన్నారులు సాధారణ జీవితం గడిపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. క్రమం తప్పకుండా రక్తం ఎక్కించుకుంటూ, మందులు వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు అండగా ఉండేందుకు సంకల్ప సంస్థతో కలిసి నడుస్తామని అన్నారు. చిన్నారుల కోసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో సంకల్ప సంస్థ ఫౌండర్ పి.అనిత, ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి పి.రవిచందర్, ఉదయ్భాస్కర్, వంశీకిరీటి, ఉపేందర్, మధు, ప్రముఖ మీడియా ప్రతినిధి అడప నాగేందర్, డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
తలసేమియాతో చిన్నారుల
ప్రాణాలకు ప్రమాదం లేదు
టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోనల్
వైద్యాధికారి గిరిసింహారావు