
నీట్ ఫలితాల్లో పమిడిపాడు విద్యార్థిని ప్రతిభ
బొల్లాపల్లి: జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన పమిడిపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని కొత్త భవిష్యరెడ్డి ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయి లో 1649, రాష్ట్రస్థాయిలో 940 ర్యాంకు సాధించి ప్రతిభ చాటింది. విద్యార్థిని భవిష్యరెడ్డిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఉన్నత చదువులు చదివి పుట్టిన ప్రాంతానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
ప్రయాణికుడిని దోచుకున్న కేసులో ఇద్దరు అరెస్టు
నరసరావుపేట రూరల్: ఓ ప్రయాణికుడిని ఆటోలో ఎక్కించుకొని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని బెదిరించి అతని వద్దనున్న బంగారం ఉంగరం, రెండు సెల్ఫోన్లు, నగదు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ డి.అశోక్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈనెల 9వ తేదీ రాత్రి 11గంటల సమయంలో పుల్లబొట్ల శివప్రసాద్ పిడుగురాళ్ల వెళ్లేందుకు పల్నాడు బస్టాండ్లో ఎదురుచూస్తుండగా తాము వదిలిపెడతామంటూ బొమ్మిశెట్టి వెంకయ్య, వేముల వెంకటశివ అనే ఇద్దరు వ్యక్తులు కిరాయి మాట్లాడుకొని ఆటో ఎక్కించుకున్నారు. మార్గంలోని రావిపాడు గ్రామం దాటిన తర్వాత పాలపాడు–నల్లగార్లపాడు గ్రామాల మధ్యకు తీసుకెళ్లి అతడిని కొట్టి బెదిరించి అతని వద్దనున్న సొమ్ము కాజేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ జంక్షన్లో ఇద్దరు నిందితులను అరెస్టుచేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ బాపట్ల
జిల్లా ఉపాధ్యక్షుడిగా ‘కోడూరి’
చీరాల అర్బన్: వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూ రి ప్రసాద్రెడ్డి నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంక టేష్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

నీట్ ఫలితాల్లో పమిడిపాడు విద్యార్థిని ప్రతిభ