కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు జిల్లా నేతలు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి జిల్లాలోని రాజకీయ పరిస్థితులను, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గూర్చి వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా బూత్ లెవల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాడే శివయ్యనాయుడు తదితరులు ఉన్నారు.


