రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర: ఎమ్మెల్యే ఆర్కే | Ysrcp Mla Alla Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర: ఎమ్మెల్యే ఆర్కే

May 24 2023 6:15 PM | Updated on May 24 2023 6:15 PM

సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరిలో 23 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించబోతున్నామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే, కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కోర్టులో పేదలకు న్యాయం జరిగింది.’’ అని ఆర్కే అన్నారు.

‘‘పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం. సీఎం జగన్‌ పేదలకు అండగా నిలిచారు. రాజధానిలో పేదలు ఉండొద్దంటూ టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించింది. రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర. దీపావళి కల్లా మంగళగిరిలో కూడా జగనన్న కాలనీలు పూర్తవుతాయి. ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement