సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు..
వైఎస్ జగన్ స్పీచ్ హైలైట్స్
చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు
బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది
జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు
మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది
- కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది
- మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు
- సూపర్-6, సూపర్-7 లేదు
- ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు
- 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు
- 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే
- నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు
- ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది
- మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు
వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?
- పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు
- తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు
- ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు
- రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!
- తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది
ఇప్పటికీ హామీల అమలు లేదు
- చంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసు
- మంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరు
- మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు
- ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు
- గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు
- ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు
- కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి
- వైఎస్సార్ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం

వెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణ
- చంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లు
- సూపర్సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు
- చంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదల
- బుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్
- చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్ జగన్
- రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్ జగన్
- జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్ జగన్
- జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు: వైఎస్ జగన్
- 8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు: వైఎస్ జగన్
- 12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్ జగన్
- ఎండలు, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్: వైఎస్ జగన్
- ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్ జగన్
- కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్ జగన్
- ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్ జగన్
జగన్ కీలక వ్యాఖ్యలు
- ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి
- చంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసు
- మున్పిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాం
- పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాం
- అందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
- ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలి
- ఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు
- చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి
- ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాం
- ఏకగ్రీవం జరిగిందంటే ఇన్చార్జిలు ఫెయిల్ అయ్యారన్నమాట
- ఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయి
- వీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలి
- వైఎస్సార్సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలి
- బాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలి
- స్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి
సర్ ప్రక్రియ గురించి..
- బెంగాల్, తమినాడు ఎన్నికలను అంతా చూశారు
- సర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారు
- మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారు
- ఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారు
- తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్లో 71 వేల ఓట్లు తొలగించారు
- ఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో..
- ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి
- 91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించారు
- మమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారు
- తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారు
- స్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడారు
- కాబట్టి సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి
- ఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారు
- కుప్పంలో కళ్లెదుటే అది కనిపించింది
- ఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీ
- మనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ..



