సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (21 ఆగస్టు, శుక్రవారం) హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.


