విజయవాడ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan Meeting With Vijayawada YSRCP Leaders, Corporators Updates | Sakshi
Sakshi News home page

విజయవాడ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Feb 5 2025 11:48 AM | Updated on Feb 5 2025 2:16 PM

YS Jagan Meeting With Vijayawada YSRCP Leaders, Corporators Updates

గుంటూరు, సాక్షి: విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు. 

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారి తీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో  కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారాయన. 

ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే.. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.  ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్‌ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌, పోతిన మహేష్‌ తదితరులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement