ముంపు గ్రామస్తులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి బాసట | Tirupati MP Gurumurthy support for flood area villagers | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామస్తులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి బాసట

Nov 24 2025 12:14 PM | Updated on Nov 24 2025 1:14 PM

Tirupati MP Gurumurthy support for flood area villagers

సాక్షి, తిరుపతి: కే.వి.బి.పురం మండలంలోని ఒల్లూరు రాయల చెరువు ముంపు గ్రామస్తులకు తిరుపతి ఎంపీ వైఎస్సార్‌సీపీ నాయకుడు గురుమూర్తి అండగా నిలిచారు. ముళ్లూరి మండలం, కళత్తూరు గ్రామంలో దళిత కుటుంబాలకు ఎంపీ గురుమూర్తి ఆర్థిక సహాయం అందించారు. 

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కళత్తూరు గ్రామంలోని దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం నేను పని చేస్తున్నాను. ఈ స్థాయిలో వారికి సహాయం చేయడం నాకు గౌరవంగా ఉంది. గ్రామ పునరుద్ధరణ కోసం ఎంపీ నిధులను మంజూరు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరాను. ఈ చర్యలు గ్రామ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అని ఎంపీ గురుమూర్తి అన్నారు.

కళత్తూరు దళితవాడ అభివృద్ధి కోసం ఎంపీ గురుమూర్తి ఇప్పటి వరకు కోటి 20 లక్షల రూపాయల సహాయం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement