10న సచివాలయ ఉద్యోగుల ‘విజయవాడ మార్చ్‌’ | Secretariat Employees Protest: Andhra pradesh | Sakshi
Sakshi News home page

10న సచివాలయ ఉద్యోగుల ‘విజయవాడ మార్చ్‌’

Sep 29 2025 6:01 AM | Updated on Sep 29 2025 6:01 AM

Secretariat Employees Protest: Andhra pradesh

విజయవాడ మార్చ్‌ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న జేఏసీ నాయకులు, ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ప్రకటన

ఇంటింటి సర్వే బాధ్యతల నుంచి తప్పించాలి

నోషనల్‌ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరియర్స్‌ను మంజూరు చేయాలి

ఆరేళ్ల సర్వీస్‌ పూర్తయిన ప్రతి సెక్రటరీకి ఏఏఎస్‌ ఇంక్రిమెంట్‌ వర్తింపజేయాలి

ఉద్యోగులందరికీ జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ ఇవ్వాలి

ప్రమోషన్‌ చానల్, జాబ్‌ చార్ట్‌ను అమలు చేయాలని డిమాండ్‌

వలంటీర్ల విధులను నిర్వహించబోమని స్పష్టీకరణ

సింహాచలం (విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం తమ న్యా­య­మైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేక­పోతే అక్టోబర్‌ 10వ తేదీన లక్ష మంది గ్రామ, వార్డు సచి­వాలయాల ఉద్యోగులతో విజయవాడ మార్చ్‌ ని­ర్వ­హిస్తామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచి­వాలయ ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ప్రకటించింది. విశాఖపట్నంలోని సింహాచలంలో ఆదివారం ఆంధ్ర­ప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ జానీ పాషా మాట్లా­డుతూ వలంటీర్ల విధులను గ్రామ, వార్డు సచి­వా­లయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తించబో­రని స్పష్టం చేశారు.

తక్షణమే ఇంటింటి సర్వే విధుల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలని డి­మాండ్‌ చేశారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరి­యర్స్‌ను వెంటనే మంజూరు చేయా­లన్నారు. ఆరేళ్లు సర్వీç­Üు పూర్తయిన ప్రతి సెక్రటరీకి ఏఏఎస్‌ ఇంక్రి­మెంట్‌ వర్తింపజేయాలని, ఉద్యోగులందరికీ జూని­యర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌కు అప్‌గ్రేడ్‌ చేసి ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలని, జాబ్‌ చార్ట్‌ను తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్‌ విప్పర్తి విఖిల్‌ కృష్ణ, కన్వీనర్‌ అబ్జుల్‌ రజాక్, అర్గనైజింగ్‌ సెక్రటరీ వెస్లీ, కో–చైర్మన్లు భార్గవ్‌ సుతేజ్, అంకమ్మరావు, రాజేష్, వైస్‌ చైర్మన్లు శ్రీని­వా­స్, నాగే­శ్వ­ర­రావు, గ్రేటర్‌ విశాఖ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement