అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ.. వైఎస్‌ జగన్‌ జలహారతి | Pulivendula: Ys Jagan Jala Harathi At Ambakapalli Lake | Sakshi
Sakshi News home page

అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ.. వైఎస్‌ జగన్‌ జలహారతి

Sep 2 2025 6:38 PM | Updated on Sep 2 2025 8:08 PM

Pulivendula: Ys Jagan Jala Harathi At Ambakapalli Lake

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అంబకపల్లె చెరువు దగ్గర వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలహారతి ఇచ్చారు. అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్‌ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement