సీఎం జగన్‌ను కలిసిన పాలిటెక్నిక్‌ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు

Polytechnic Lecturers JAC Representatives Thanked CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌-2016ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్‌ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ కన్వీనర్‌ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్లు రామ్మోహన్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్‌, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సీఎంను కలిశారు.
చదవండి: బాబూ..ఆ డబ్బులు ఏమయ్యాయి? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top