breaking news
Lecturers Association of Polytechnic
-
సీఎం జగన్ను కలిసిన పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్-2016ను పాలిటెక్నిక్ లెక్చరర్స్కు వర్తింపజేస్తూ జీవో నెంబర్ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ కన్వీనర్ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్లు రామ్మోహన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సీఎంను కలిశారు. చదవండి: బాబూ..ఆ డబ్బులు ఏమయ్యాయి? -
శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకులు మంగళవారం ధర్నా చేపట్టారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్లాస్ రూమ్లోకి వెళ్లి ఇద్దరు అధ్యాపకులు స్వీయ నిర్బంధం అయ్యారు. విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. చదవండి: నాకు తెలియకుండా షాప్ పెడ్తార్రా..! వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఫీజుల బాగోతం -
ఎంసెట్ కౌన్సెలింగ్పై నీలినీడలు
సమైక్యాంధ్ర సమ్మె ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈనెల 19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనున్న తరుణంలో సీమాంధ్రలో 19 నుంచి తనిఖీ విధులను బహిష్కరిస్తున్నట్టు పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అజయ్జైన్లకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. ఈనెల 17న సామూహిక సెలవులు పెడుతున్నట్టు, 19 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ విధులను బహిష్కరిస్తున్నట్టు పాలా చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ నోటీసుల్లో పేర్కొన్నారు. సీమాంధ్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులు ఈనెల 19 నుంచి సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని హెల్ప్లైన్ సెంటర్లలో విధులకు హాజరుకారని చంద్రశేఖర్ విశాఖలో చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాష్ట్రవ్యాప్తంగా 57 హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. వీటిలో 34 సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. ఈ హెల్ప్లైన్ సెంటర్లన్నీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోనే ఉన్నాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో కీలకమైన పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఆయా కళాశాలల సిబ్బంది విధుల బహిష్కరణ పిలుపునివ్వడంతో ఈ హెల్ప్లైన్ సెంటర్లు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలు ఆలస్యమవుతున్న తరుణంలో హెల్ప్లైన్ సెంటర్లు యథావిధిగా నడిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్రావు తెలిపారు. కౌన్సెలింగ్ వాయిదా పడదని, ఈనెల 19న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగిస్తామని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ చెప్పారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగించాలని, తొలిరోజు పరిస్థితి చూసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.