MP Avinash Reddy Parents Hospitalized Due To Illness - Sakshi
Sakshi News home page

ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత

May 26 2023 4:37 PM | Updated on May 26 2023 5:05 PM

MP Avinash Reddy Parents Hospitalized Due To Illness - Sakshi

సాక్షి కర్నూలు/ హైదరాబాద్‌: ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి  తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్‌ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. 

మరోవైపు.. వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్‌ రెడ్డికి రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్‌ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. 

ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement