
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువ గా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తులు వేచి ఉన్న క్యూ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 74,468 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,878 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది.
దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.