ఏడో రోజు బ్రహ్మోత్సవాలు: తిరుమల రద్దీ ఎలా ఉందంటే.. | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

ఏడో రోజు బ్రహ్మోత్సవాలు: తిరుమల రద్దీ ఎలా ఉందంటే..

Sep 30 2025 7:35 AM | Updated on Sep 30 2025 7:35 AM

Huge Devotees Rush At Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.   సోమవారం అర్ధరాత్రి వరకు 81,626  మంది స్వామిని దర్శించుకున్నారు. 25,304  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.14  కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు  24  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

  • తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
    నేడు ఏడవరోజు
    ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
    మారికాసెపట్లో తిరు వీధుల్లో చంద్రప్రభ వహనంలో ఊరేగింపు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement