గోకుల క్షేత్రానికి భూ కేటాయింపు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు | Hare Krishna Movement AP ADM Satya Gaura Chandra Thanks To CM Jagan | Sakshi
Sakshi News home page

గోకుల క్షేత్రానికి భూ కేటాయింపు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

Feb 17 2022 1:35 PM | Updated on Feb 17 2022 2:36 PM

Hare Krishna Movement AP ADM Satya Gaura Chandra Thanks To CM Jagan - Sakshi

పటమట (విజయవాడ తూర్పు): సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సేవలు హర్షణీయమని హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఇండియా రాష్ట్ర ఏడీఎం సత్యగౌరచంద్రదాస్‌ చెప్పారు. విజయవాడలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ సంస్థ తాడేపల్లి మండలం కొలనుకొండలో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గోకుల క్షేత్రం నిర్మాణం ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్‌ బెంగళూరు ప్రెసిడెంట్‌ మధుపండిట్‌దాస్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. 
(చదవండి: బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్‌ మైన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement