ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.68,12,739 కోట్లు!
వడ్డీ చెల్లింపులకు రూ.1,32,967 కోట్లు
ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులకు రూ.80.627 కోట్లు
రెవెన్యూ ఆదాయం, వ్యయంపై 15వ ఆర్థిక సంఘం అంచనా
సాక్షి, అమరావతి: వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.68,12,739 కోట్లకు చేరుతుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఇదే కాలంలో ఏకంగా రూ.1,32,967 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఐదేళ్లలో పెన్షన్ కింద రూ.80,627 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం ఇలా ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.